medianu vaadukune vaade

*మీడియాను వాడుకునే వాడే కానీ, ఆదుకునే వాడు లేడు...*


ప్రజా ప్రతినిధులు,  రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు,  వైద్యులు, విద్యా సంస్థలు, ఫౌల్ట్రీ రంగం, స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు...ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ప్రతి రంగం వార్తలను...,
ప్రతి విలేకరి, (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా)వారు వ్రాసారు, రాస్తున్నారు.
వాట్సాప్ లో వార్తలు పెట్టటం తో పాటు అక్కడ ప్రెస్ మీట్, ఇక్కడ ప్రెస్ మీట్ అని మెసేజీలు ఇస్తూ పాత్రికేయులను వాడుకున్న వారు ప్రస్తుతం కనుచూపు మేరలో కనడటం లేదు.


 ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి మీద యుద్ధం ప్రకటించి విలేకరులు కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రతి నిత్యం వార్తలు సేకరిస్తున్నారు. జీత భత్యాలు లేక బతుకు బండి లాగుతూ విశ్లేషణ తో కూడిన వార్తలు సమాజానికి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మా వార్త వ్రాయండి, మా వార్త రాయండి..!


అంటూ చెప్పిన ప్రముఖులు ఒక్కరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులకు కనీసం సానిటైజర్స్, మాస్కులు, గ్లోజులు కూడా పంపిణీ చేసిన దిక్కు లేదు. కనీసం ఫోన్ చేసి పరామర్శించిన వ్యక్తే లేడు. పాత్రికేయ మిత్రులారా..! ఆలోచించి నిర్ణయం తీసికొండి...!


కనీసం ప్రభుత్వం కూడా పట్టించు కోవటం లేదు. హెల్త్ కార్డ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ , అక్రిడేషన్ కార్డ్స్ లేవు. వాటి గూర్చి పట్టించు కున్న నాధుడే లేరు. విలేకరులు ఎక్కడైన తిరగొచ్చు అని మేసేజ్ మాత్రం ఇచ్చారు. ఆరోగ్యానికి మాత్రం రక్షణ, భరోసా లేదు. మనకు కుటుంబాలు, పిల్లలు, బాధ్యతలు ఉన్నాయి. అనవసరంగా  బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి వార్తలు అందిస్తే మంచిది. తమ అవసరాలకు అనుగుణంగా వాడుకొని, తరువాత పట్టించుకోకుండా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి
 ప్రతి పాత్రికేయడు స్వీయ రక్షణలో ఉండండి. కుటుంబాలతో కలసి ఉండండి. బయటకు వచ్చేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసికొని రావటం మంచిది.....


 కనీసం జిల్లా, మండల స్థాయి విలేకరుల అవసరాలకు అపత్కాల సమయంలో నిత్యావసర వస్తువులు...., ఆర్థిక సహాయం కానీ ఇస్తాను అన్న నాధుడే లేడు. ప్రతి ఒక్కరూ మికేమిటి విలేకరులు అనే వారు. మా బాధలు,బాధ్యతలు ఎవరికి ఎరుక, జీతాలు లేవు. భత్యాలు లేవు పైపై మెరుగులే, కరోనా వైరస్ వచ్చింది. 


జాగ్రత్తగా ఉండండి అని విలేకరి వ్రాస్తేనే ప్రపంచానికి తెలిసింది, తెలిపింది విలేకరే, సమాజాన్ని జాగృతం చేసి మేలుకొలిపే ది మనమే, మనలను ఆదుకునే నాధుడే లేడు, లాకౌట్ సమయంలో తిన్నారా, ఎలా ఉన్నారు ? అని పలకరించే నాధుడే లేడు. వార్తలు వ్రాసారా, మా వార్త ఈ రోజు వచ్చిందా?  అని అడిగారే గాని ఇప్పుడున్న పరిస్థితులలో సహాయం చేసే నాధుడు ఏడి..? మిత్రులారా...!


జాగ్రత్త ఉండండి. మనలను మనమే కాపాడుకోవాలి, తప్పకుండా ప్రతీ ఒక్కరు క్వారంటైన్ లో ఉంటూ కుటుంబాలకు దగ్గరగా ఉండమని మనవి....


పూర్తి జాగ్రత్తలు పాటించండి... వాడుకునే వాడే కానీ, ఆదుకునే వాడు లేడు... దీనిని దృష్టిలో ఉంచు కొని పని చేయండి..
ఇది 


*జర్నలిస్టుల పరిస్థితి*..🙏🏽.🙏🏼🙏🏼