kendraprabutvam pai prasamsa

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ప్రశంసల జల్లు కురిపించింది. కరోనాను అడ్డుకునేందుకు కేంద్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది. విమర్శకులు కూడా మెచ్చుకునే రీతిలో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించింది.


కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశంసల వర్షం కురిపించింది. కరోనాపై పోరుకు కేంద్రం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించింది. విమర్శకులు కూడా మెచ్చుకునే స్థాయిలో ప్రభుత్వ పనితీరు ఉందని పేర్కొంది.
"కరోనా వైరస్​ కట్టడికి కేంద్రం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. కేంద్రం పనితీరు బాగుందని విమర్శకులు కూడా అంటున్నారు. ఇవి రాజకీయాలు కావు.. వాస్తవాలు."- జస్టిస్​ ఎస్​ఏ బొబ్డే, భారత ప్రధాన న్యాయమూర్తి
కొవిడ్​-19 పై పోరులో కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టాలని దాఖలైన వ్యాజ్యాల విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఎల్​ఎన్​ రావ్​ల​ ధర్మాసనం. కరోనా అనుమానిత పరీక్షల కోసం ప్రయోగశాలలను పెంచడమే కాకుండా.. మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది